ఒమన్ లేబర్ మార్కెట్..అభివృద్ధి పై కీలక ముందడుగు..!
- August 12, 2024
సలాలా: లేబర్ ఫోరమ్.. "టుగెదర్ వీ వర్క్..టుగెదర్ వీ ఇన్నోవేల్ అండ్ ప్రాస్పర్" అనే శీర్షికతో లేబర్ మార్కెట్ను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గాలను పరిశీలించడంతో పాటు దానికి సంబంధించిన సమస్యలను చర్చిస్తుంది. 400 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ నిపుణులు, పెట్టుబడిదారులు ఫోరమ్లో పాల్గొంటున్నారు. ఇది ఆగస్టు 29 వరకు కొనసాగుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా మిలీనియం సలాలా హోటల్లో ప్రారంభించబడిన ఫోరమ్.. కార్మిక మంత్రి డాక్టర్. మహద్ సెయిద్ బావోయిన్ ఆధ్వర్యంలో అరబ్ ప్రపంచంలోని వృత్తిపరమైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ వ్యవస్థ గురించి కూడా చర్చిస్తుంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (SDGలు), కొత్త పని నమూనాలు, పోటీ సామర్థ్యాలను పెంపొందించడంలో కార్మికుల పాత్ర, వృత్తిపరమైన కౌన్సెలింగ్ వంటి సంస్కరణలపై కూడా చర్చలుంటాయని లేబర్ మినిస్ట్రీ వెల్లడించారు. ఫోరమ్లో 40 మంది వక్తల భాగస్వామ్యంతో 12 డైలాగ్ సెషన్లు ఉన్నాయని, మానవ వనరుల అభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, సామాజిక బాధ్యతతో పాటు మంచి పని వాతావరణం, ఒమన్ విజన్ 2040 దిశలను సమీక్షించడంతో సహా ప్రధాన అంశాల స్పెక్ట్రమ్ను సమీక్షించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









