ఫింటాస్ ఎక్స్ఛేంజ్ దోపిడీ.. నిందితుడు అరెస్ట్
- August 12, 2024
కువైట్: ఫింటాస్ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ దోపిడీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ (అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్) వెల్లడించింది. నిందితుడు మారణాయుధాలతో ఎక్సేంజ్ ఆఫీస్పై దాడి చేసి గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయాడని పేర్కొన్నది. పోలీసు అధికారి వెంటనే దర్యాప్తు ప్రారంభించి, నిఘా కెమెరాలు మరియు ఇతర ఆధారాలను ఉపయోగించి ట్రాక్ చేయగలిగారని, నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అతనిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమర్థ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







