రన్ ఓవర్ ప్రమాదం.. వాహనదారుడు, పాదచారులకు జరిమానా
- August 12, 2024
దుబాయ్: డ్రైవర్లు మరియు పాదచారులు ఇద్దరికీ నిబంధనలు, జరిమానాలు వర్తిస్తాయని.. ట్రాఫిక్ చట్టాల గురించి తెలుసుకోవాలని దుబాయ్ నివాసితులకు న్యాయ నిపుణుడు పిలుపునిచ్చారు. రన్ ఓవర్ ప్రమాదం తర్వాత దుబాయ్ కోర్టు ఒక వాహనదారుడికి మరియు పాదచారికి జరిమానా విధించింది. ఇతరుల భద్రతకు హాని కలిగించినందుకు వాహనదారుడికి 3,000 దిర్హామ్లు, నిర్దేశించని ప్రాంతం నుండి రోడ్డు దాటినందుకు పాదచారులకు 200 దిర్హామ్లు జరిమానా విధించినట్లు న్యాయ నిపుణుడు అబ్దుల్రహ్మాన్ అల్ కస్సెమ్ వెల్లడించారు.
యూఏఈలో పాదచారులు రోడ్లు దాటడానికి జీబ్రా క్రాసింగ్లు, వంతెనలు లేదా సబ్వేలను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే 400 దిర్హామ్ల జరిమానా చెల్లించాలి. దుబాయ్ లో గత ఏడాది రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







