రన్ ఓవర్ ప్రమాదం.. వాహనదారుడు, పాదచారులకు జరిమానా
- August 12, 2024
దుబాయ్: డ్రైవర్లు మరియు పాదచారులు ఇద్దరికీ నిబంధనలు, జరిమానాలు వర్తిస్తాయని.. ట్రాఫిక్ చట్టాల గురించి తెలుసుకోవాలని దుబాయ్ నివాసితులకు న్యాయ నిపుణుడు పిలుపునిచ్చారు. రన్ ఓవర్ ప్రమాదం తర్వాత దుబాయ్ కోర్టు ఒక వాహనదారుడికి మరియు పాదచారికి జరిమానా విధించింది. ఇతరుల భద్రతకు హాని కలిగించినందుకు వాహనదారుడికి 3,000 దిర్హామ్లు, నిర్దేశించని ప్రాంతం నుండి రోడ్డు దాటినందుకు పాదచారులకు 200 దిర్హామ్లు జరిమానా విధించినట్లు న్యాయ నిపుణుడు అబ్దుల్రహ్మాన్ అల్ కస్సెమ్ వెల్లడించారు.
యూఏఈలో పాదచారులు రోడ్లు దాటడానికి జీబ్రా క్రాసింగ్లు, వంతెనలు లేదా సబ్వేలను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే 400 దిర్హామ్ల జరిమానా చెల్లించాలి. దుబాయ్ లో గత ఏడాది రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









