సీనియర్‌ బ్యాంకర్లను హైర్‌ చేసుకున్న బ్యాంక్‌ ఎబిసి

- June 16, 2016 , by Maagulf
సీనియర్‌ బ్యాంకర్లను హైర్‌ చేసుకున్న బ్యాంక్‌ ఎబిసి


 
బహ్రెయిన్‌కి చెందిన బ్యాంక్‌ ఎబిసి, పలువురు సీనియర్‌ బ్యాంకర్లను హైర్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. మెనా రీజియన్‌లో అంతర్జాతీయ బ్యాంక్‌గా అభివృద్ధి చెందేదుకోసం ఈ హైరింగ్స్‌ జరిగాయనీ, బ్యాంక్‌ విస్తరణ దిశగా ఈ హైరింగ్‌ తమకు ఉపయోగపడుతుందని బ్యాంక్‌ ఎబిసి అంచనా వేస్తోంది. బ్యాంక్‌ ఎబిసి గ్రూప్‌ హెడ్‌ ఆఫ్‌ ట్రెజరీ మరియు ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌గా క్రిస్టోఫర్‌ విల్‌మోట్‌ జాయిన్‌ అయ్యారు. దుబాయ్‌కి చెందిన డిఐఎఫ్‌సి, అలాగే సింగపూర్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడానికి రెగ్యులేటరీ అప్రూవల్‌ కూడా పొందనుంది. అంతర్జాతీయ సర్వీసుల్ని అందించడం ద్వారా తమ క్లయింట్స్‌కి మెరుగైన సేవల్ని అందించాలని, అలాగే ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ని డెవలప్‌ చేసుకోవాలని బ్యాంక్‌ ఎబిసి భావిస్తోంది. ఇప్పటికే బ్యాంక్‌ ఎబిసి, స్పెషలైజ్డ్‌ మరియు టాలెంటెడ్‌ టీమ్‌ని సొంతం చేసుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com