ఇండియన్ ఎంబసీ యోగా దినోత్సవం
- June 16, 2016
ఇండియన్ ఎంబసీ, 2వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని అల్ గరాఫా స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ హాల్లో జూన్ 21న నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కల్చరల్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ ఖతార్లో పర్యటించినప్పుడు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో యోగాపై చర్చించారు. ప్రపంచం యోగాని ఓ ఆరోగ్యకరమైన ప్రక్రియగా గుర్తించిందనీ, ఆరోగ్యకరమైన సమాజం కోసం ఎంతో ఉపయోగపడుతుంది గనుక, యోగాకు తమ దేశంలోనూ ప్రాచుర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమిర్ షేక్ చెప్పారు. 2015, జూన్ 21న నిర్వహించిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణలో సహకరించినందుకు ఎమిర్ షేక్కి నరేంద్రమోడీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇండియన్ ఎంబసీ నిర్వహించే యోగా వేడుకల్లో ఖతారీ డిగ్నిటరీస్కి ఖతార్లోని ఇండియన్ అంబాసిడర్ ద్వారా సన్మానం జరగనుంది. అలాగే యోగా ఎక్స్పర్ట్లచే రూపొందించిన షార్ట్ ఫిలింని ప్రదర్శిస్తారు. యోగా కార్యక్రమానికి స్థానిక వస్త్రధారణ సరిపోతుందని, విజిటర్స్ ఖచ్చిరతంగా తమతోపాటు ఫొటో ఐడి తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







