కువైట్ నుంచి ఫోన్ లో భార్యకు ట్రిపుల్ తలాక్...పాకిస్థాన్ లేడీ ట్రాప్లో పడి....!
- August 16, 2024
కువైట్ సిటీ: కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తానీ మహిళను సౌదీ అరేబియాలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని చురు జిల్లాకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్ళాడు. అక్కడ రవాణా రంగంలో పనిచేస్తున్నాడు. 2011లో హనుమాన్ గడ్ జిల్లాకు చెందిన ఫరీదా భానుతో రెహమాన్ పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు
కాగా.... కువైట్ లో ఉంటున్న రెహమాన్ కు పాకిస్తానీ మహిళ మెహ్విష్ తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆమెను వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. గత నెలలో కువైట్ నుంచి తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత మెహ్విష్ ను వివాహం చేసుకున్నాడు. గత నెలలో ఆమె టూరిస్ట్ వీసాపై రాజస్థాన్ కు వెళ్ళింది. రెహమాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మరోవైపు కువైట్ నుంచి ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పి పాకిస్తాన్ మహిళను పెళ్లాడిన రెహమాన్ పై రాజస్థాన్ లోని తన భార్య ఫరీదా భాను గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం తనను వేధించడంతో పుట్టింట్లో ఉంటున్నట్లు చెప్పింది. దీంతో రెహ్మాన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన రెహమాన్ ను హనుమాన్ గడ్ కు చెందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రెహమాన్ మొదటి భార్య ఫిర్యాదుపై అతడిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు.
--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







