అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ లో పడి తెలంగాణ వాసి మృతి..
- August 27, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి తెలంగాణ వ్యక్తి మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటన.. ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి... అమెరికాలో టీచర్గా పని చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ సరదాగా... తాజాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం... ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని సమాచారం. అయితే తెలంగాణ వాసి అమెరికాల మృతి చెందిన నేపథ్యంలో... అతని పార్థివ దేహాన్ని సూర్యపేటకు తీసుకురావాలని... ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ... తమ ఆవేదనను... వెళ్లగక్కుతున్నారు.
అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యుల బాధను చూసి తరించుకుపోయిన జగదీశ్ రెడ్డి... వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికాలో మృతి చెందిన సూర్యపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని వెంటనే... తెలంగాణకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







