అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ లో పడి తెలంగాణ వాసి మృతి..
- August 27, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి తెలంగాణ వ్యక్తి మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటన.. ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి... అమెరికాలో టీచర్గా పని చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ సరదాగా... తాజాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం... ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని సమాచారం. అయితే తెలంగాణ వాసి అమెరికాల మృతి చెందిన నేపథ్యంలో... అతని పార్థివ దేహాన్ని సూర్యపేటకు తీసుకురావాలని... ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ... తమ ఆవేదనను... వెళ్లగక్కుతున్నారు.
అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యుల బాధను చూసి తరించుకుపోయిన జగదీశ్ రెడ్డి... వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికాలో మృతి చెందిన సూర్యపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని వెంటనే... తెలంగాణకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు







