అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ లో పడి తెలంగాణ వాసి మృతి..
- August 27, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి తెలంగాణ వ్యక్తి మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటన.. ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి... అమెరికాలో టీచర్గా పని చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ సరదాగా... తాజాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం... ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదని సమాచారం. అయితే తెలంగాణ వాసి అమెరికాల మృతి చెందిన నేపథ్యంలో... అతని పార్థివ దేహాన్ని సూర్యపేటకు తీసుకురావాలని... ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ... తమ ఆవేదనను... వెళ్లగక్కుతున్నారు.
అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యుల బాధను చూసి తరించుకుపోయిన జగదీశ్ రెడ్డి... వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికాలో మృతి చెందిన సూర్యపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని వెంటనే... తెలంగాణకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









