రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ : ఎయిర్ ఏసియా..
- June 18, 2016
సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'కబాలి' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు... తమిళనాడు రాష్ట్ర ప్రజల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ 'కబాలి'నే హాట్ టాపిక్. అలాగని బెంగళూరు అభిమానులేం తక్కువ కాదు... వారూ అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకని ఈ చిత్ర బృందం బెంగళూరులోని రజినీ అభిమానులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. చిత్రం విడుదల రోజున ఫస్ట్ డే ఫస్ట్షోకు బెంగుళూరు నుంచి చెన్నైకి ప్రత్యేకంగా ఎయిర్ ఏసియా విమానాన్ని నడుపుతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.
'కబాలి' చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం ఎయిర్లైన్ అవసరం వచ్చిందట.
ఇందులో భాగంగానే ఎయిర్ ఏసియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎయిర్ ఏసియా రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. ఇప్పటికే ప్రయాణికులకోసం కబాలి ప్రత్యేక మెనూ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెంగళూరు - చెన్నై - బెంగళూరు ప్యాకేజిలో రాను పోను టికెట్, సినిమా టికెట్, లంచ్ కూడా కలిసి మొత్తం..రూ.7860. ఇది సినిమా రిలీజ్ అయిన రోజున మాత్రమే సుమా!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







