విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్
- September 01, 2024
విజయవాడ: విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్లో కొండ చరియలు విరిగిపడటంతో ఘాట్రోడ్ను మూసివేశారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇటు నందిగామ వద్ద వాగు పొంగడంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి-అద్దంకి రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. శనివారం సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలోని లక్కవరం రోడ్లో అత్యధికంగా 27.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిలుకూర్లో 26.7, మట్టంపల్లిలో 24, కోదాడలో 17, రఘునాథపాలెంలో 15, బాలారంతండా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









