డిజిటల్ చెల్లింపులు.. QR31.02bn లావాదేవీలు..!
- September 02, 2024
దోహా: ఖతార్లోని ఫిన్టెక్ రంగం చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. స్టాటిస్టా నివేదించిన ప్రకారం.. ఖతార్లోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 2024 నాటికి QR31.02bn ($8.52bn) మొత్తం లావాదేవీ విలువను సాధించగలదని అంచనా వేస్తున్నారు. ఇంకా, ఈ మార్కెట్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 8.37%ని ప్రదర్శిస్తుందని, 2028 నాటికి మొత్తం QR42.78bn ($11.75bn) చేరుకుంటుందని భావిస్తున్నారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్తో 2024 పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక హైలైట్ చేసింది. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో ఒక్కో వినియోగదారునికి నిర్వహణలో ఉన్న సగటు పెట్టుబడులు (AUM) 2024లో QR1,760.55 ($483.60)కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మార్కెట్లో ఆదాయ వృద్ధి 2025లో 14.48%గా అంచనా వేశారు. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) 2023లో ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా ఫిన్టెక్ వ్యూహాన్ని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో 'బై-నౌ-పే-లేటర్' (BNPL) సేవల పెరుగుదలతో, సెంట్రల్ బ్యాంక్ 2023లో BNPL మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. ఇందులో లైసెన్సింగ్ విధానాలు, వినియోగదారు రక్షణ చర్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో QCB BNPL అందించడానికి ఐదు కంపెనీలకు ఆమోదం తెలిపింది. ఖతార్ ఫిన్టెక్ హబ్ 57 ఫిన్టెక్ కంపెనీలకు అనుమతి ప్రక్రియను పూర్తి చేయగా.. అవి $500 మిలియన్ల విలువను కలిగి ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్, ఇండియా, బంగ్లాదేశ్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇతర దేశాల నుండి 26 ఫిన్టెక్ సంస్థలు తమ ఆపరేషన్లను ఖతార్ లో సమర్థవంతంగా నిర్వహియిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









