దుబాయ్ లో విల్లాలు, అపార్ట్మెంట్లలో చట్టపరమైన పరిమితులు..!
- September 02, 2024
దుబాయ్: ఎమిరేట్లోని విల్లాలు, అపార్ట్మెంట్లలో చట్టపరమైన పరిమితులను విధించారు. 5.0 చదరపు మీటర్ల స్థలంలో ఒక వ్యక్తిని దుబాయ్ చట్టం అనుమతించారు. "దుబాయ్ మునిసిపాలిటీ బిల్డింగ్ కోడ్ ద్వారా డీల్ చేయబడిన ఆక్యుపెన్సీకి కనీస స్థలం గురించి పరిమితులు విధించారు. ఒక వ్యక్తికి కేటాయించిన స్థలం నికర ప్రాంతం నుండి 5.0 చదరపు మీటర్లు" అని అల్ తమీమి & కో రియల్ ఎస్టేట్ భాగస్వామి మహమ్మద్ కవాస్మి తెలిపారు. అయితే, లేబర్ వసతి లాంటి స్థలాల కోసం 3.7 చదరపు మీటర్లకు ఒక వ్యక్తిని దుబాయ్ నియంత్రణ అధికారులు అనుమతించారు.
ఆగస్ట్ 19న, దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (DLD) రెగ్యులేటర్ భాగస్వాములు నిర్వహించిన తనిఖీల తర్వాత 10 మంది ఆస్తి యజమానులను వారి ఆస్తులను లీజుకు ఇవ్వకుండా నిషేధించింది. అధిక రద్దీ, ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలను పూర్తి చేసే వరకు వారి ఆస్తులను లీజు మరియు సబ్లీజింగ్ నుండి నిషేధించారని మహమ్మద్ కవాస్మి తెలిపారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (డిఎల్డి) ఇటీవల అమలు చేస్తున్న చర్య దుబాయ్ రెసిడెన్షియల్ మార్కెట్లో రద్దీ నిబంధనలు కీలకమైన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందని మహమ్మద్ కవాస్మి అన్నారు. ఆస్తి యజమానులు తప్పనిసరిగా నిర్దిష్ట ఆక్యుపెన్సీ పరిమితులకు కట్టుబడి ఉండాలని, ఒక్కో పడకగదికి నివాసితుల సంఖ్య చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ నిబంధనలను పాటించడం ఆస్తి యజమానులను చట్టపరమైన చర్యల నుండి రక్షించడమే కాకుండా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం స్థిరత్వానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









