క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేనెల ఒమన్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- September 04, 2024
మస్కట్: భారత్, పాకిస్థాన్ల మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగే. U-19 ఆసియా కప్లో మ్యాచ్ అయినా లేదా ప్రపంచ కప్లో మ్యాచ్ అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ క్రికెట్ దాయాదుల మధ్య జరిగే థ్రిల్లర్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఒమన్ సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా అల్ అమెరత్లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో అక్టోబర్ 16-27వ తేదీల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, 2024 ACC పురుషుల ప్రీమియర్ కప్ నుండి మూడు క్వాలిఫైయర్ జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఒమన్లో జరిగిన ప్రీమియర్ కప్కు ఆతిథ్య ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జాతీయ జట్లు అర్హత సాధించాయి. యూఏఈ జట్టు ఫైనల్లో ఒమన్ను ఓడించి 2025 ఆసియా కప్ , ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో బెర్త్ను పొందగా, రన్నరప్ ఒమన్, మూడవ స్థానంలో ఉన్న హాంకాంగ్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్కు బెర్త్ను ఖాయం చేసుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









