విషాదం..పెళ్లయిన వారం రోజులకే యువతి మృతి..!
- September 04, 2024
యూఏఈ: పెళ్లయిన వారం రోజులకే 24 ఏళ్ల నవ వధువు రీమ్ ఇబ్రహీం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు ప్రమాదంలో మరణించింది. షార్జాలోని ఎమిరేట్స్ రోడ్లో మూడు వారాల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఎమిరాటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఆమె ఆగస్టు 31 ఉదయం మరణించారు. ప్రమాదానికి మూడు వారాల ముందు రీమ్కు వివాహం జరిగింది. వివాహమైన ఉమ్ అల్ క్వైన్ ఫలాజ్ అల్ ముఅల్లా ప్రాంతంలోని అదే హాల్లో ఆమె సంతాప సభ జరగడం అందరినీ కలచివేసింది. రీమ్ వెళుతున్న కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అతివేగంతో ఆగిఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిమ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మెదడు పూర్తిగా దెబ్బతిని కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో రోడ్లపై ఇటువంటి విషాదాలను నివారించడానికి మరింత అవగాహన, కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..