విషాదం..పెళ్లయిన వారం రోజులకే యువతి మృతి..!
- September 04, 2024
యూఏఈ: పెళ్లయిన వారం రోజులకే 24 ఏళ్ల నవ వధువు రీమ్ ఇబ్రహీం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు ప్రమాదంలో మరణించింది. షార్జాలోని ఎమిరేట్స్ రోడ్లో మూడు వారాల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఎమిరాటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఆమె ఆగస్టు 31 ఉదయం మరణించారు. ప్రమాదానికి మూడు వారాల ముందు రీమ్కు వివాహం జరిగింది. వివాహమైన ఉమ్ అల్ క్వైన్ ఫలాజ్ అల్ ముఅల్లా ప్రాంతంలోని అదే హాల్లో ఆమె సంతాప సభ జరగడం అందరినీ కలచివేసింది. రీమ్ వెళుతున్న కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అతివేగంతో ఆగిఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిమ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మెదడు పూర్తిగా దెబ్బతిని కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో రోడ్లపై ఇటువంటి విషాదాలను నివారించడానికి మరింత అవగాహన, కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









