విషాదం..పెళ్లయిన వారం రోజులకే యువతి మృతి..!
- September 04, 2024
యూఏఈ: పెళ్లయిన వారం రోజులకే 24 ఏళ్ల నవ వధువు రీమ్ ఇబ్రహీం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు ప్రమాదంలో మరణించింది. షార్జాలోని ఎమిరేట్స్ రోడ్లో మూడు వారాల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఎమిరాటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఆమె ఆగస్టు 31 ఉదయం మరణించారు. ప్రమాదానికి మూడు వారాల ముందు రీమ్కు వివాహం జరిగింది. వివాహమైన ఉమ్ అల్ క్వైన్ ఫలాజ్ అల్ ముఅల్లా ప్రాంతంలోని అదే హాల్లో ఆమె సంతాప సభ జరగడం అందరినీ కలచివేసింది. రీమ్ వెళుతున్న కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అతివేగంతో ఆగిఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిమ్ తలకు తీవ్రగాయాలు కావడంతో మెదడు పూర్తిగా దెబ్బతిని కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో రోడ్లపై ఇటువంటి విషాదాలను నివారించడానికి మరింత అవగాహన, కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







