నకిలీ భారతీయ కరెన్సీ కల్గి ఉన్న బహ్రెయిన్ ప్రవాసీయుడు అరెస్టు
- June 19, 2016
ఒక బహరేన్ ప్రవాసీయుడు నకిలీ భారతీయ కరెన్సీ నోట్లును తన స్వస్థలంలో కల్గి ఉండటంతో అరెస్టు చేశారు. భారత పోలీసుల కధనం ప్రకారం దక్షిణ భారతదేశ కేరళ రాష్ట్రం పయ్యన్నుర్ అనే గ్రామంలో మద్యం దుకాణం నుండి ఒక వ్యక్తి కొనుగోలుచేసేందుకు నకిలీ నోట్లు ఉపయోగించినట్లు తెలిపారు. దుకాణంలో పని చేసి సిబ్బంది రోజూ సేకరణ నగదుని తమ బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటానికి వెళ్ళినపుడు ఐ ఎన్ అర్ 500 ( దాదాపు 2.8 బి.డి విలువ కల ) నకిలీ కరెన్సీ అని బ్యాంకు అధికారులు తెలియజేసారు.తమ ఖాతాదారుడు ఎవరు నకిలీ నోట్ ఇచ్చేరో తెలుసుకొనేందుకు మద్యం ధుకాణదారుదు వేచి ఉన్నాడు.ఒక రోజు తరువాత మద్యం దుకాణంలో మరో మూడు నకిలీ ఐ ఎన్ అర్ 500 నోట్లు రావడం గమనించి తమకు నకిలీ నోట్లు ఇచ్చిన బిజూ కె ను పోలీసులు వచ్చే వరకు నిర్బంధించి ఉంచారు. బహరేన్ నుంచి సెలవుపై స్వదేశంకు దాదాపు 10 రోజుల గడుపుదామని వచ్చిన బిజూ కె నకిలీ నోట్ల చెలామణి కేసులో చిక్కుకొన్నాడు.పోలీసులు ఆ వ్యక్తి ఇంటి నుంచి 43 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకొని బిజూ కె ను అరెస్ట్ చేసారు. ఒక వివరణాత్మక పరిశోధనని భారతీయ పోలీసులు ఇప్పుడు ప్రారంభించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







