హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
- September 05, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యం లో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 36 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో మళ్లీ రాకపోకలు మొదలవ్వడంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్లపై రాయితీని ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







