హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
- September 05, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యం లో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 36 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో మళ్లీ రాకపోకలు మొదలవ్వడంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్లపై రాయితీని ప్రకటించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..