ట్రేడింగ్ స్కాంలో రూ. 2200 కోట్లు స్వాహా
- September 05, 2024
టెక్నాలజీ పెరుగుతున్నట్టే కుంభకోణాలు కూడా ఆర్థిక మోసాలు కూడా రంగులు మారుస్తున్నాయి. . మనం మోసం పోయామని డబ్బులన్నీ పోయాక కొంత సమయానికి గానీ తెలియరాదు అన్న రేంజ్ లో మోసపోతున్నాం. కొన్నిసార్లు ఏదో ఆశించి చేతులారా డబ్బులు మోసగాళ్లకు సమర్పించుకుంటాం. అదే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో మనమే పొలోమని వెళ్లి మోసపోతాం. అలాంటి ఘటనే అసోంలో జరిగింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. అసోంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడ్ని వేల కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్రూఘర్కు చెందిన పుకాన్ తన లగ్జరీ లైఫ్స్టైల్, హై ఫ్రొఫైల్తో అసోం, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే. . కేవలం 60 రోజుల్లో 30 శాతం రాబడిని పొందొచ్చని ఇన్వెస్టర్లను ఆకర్షించి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. తన క్రిమినల్ బ్రెయిన్తో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, నిర్మాణ రంగాల్లో డొల్ల కంపెనీలు స్థాపించాడు. అసోం సినీ పరిశ్రమలోనూ పెట్టుబడులు పెట్టి.. అక్రమంగా కోట్లు సంపాదించాడు. గువహటిలో ఓ స్టాక్ మార్కెట్ మోసానికి సంబంధించిన కేసు బయటకు రావడంతో పుకాన్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. గువహటి డిబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ మిస్సింగ్ వ్యవహారంలో పుకాన్పై ఆరోపణలు రావడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పుకాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్లలో మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెప్టెంబర్ 2 రాత్రి పుకాన్ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్తో పాటు అతని మేనేజర్ బిప్లాబ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై నాన్- బెయిలబుల్ కేసు కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. పుకాన్ కేసుతో పాటు అన్ని ట్రేడింగ్ మోసాల పై సమగ్ర విచారణకు అసోం శర్మ ఆదేశించారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఇతర ట్రెడింగ్లు, మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ‘ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యవస్థలు లేవని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. అక్రమార్కులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో మొత్తం రాకెట్ను ఛేదించేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నారు. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









