మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- September 07, 2024
న్యూ ఢిల్లీ: ప్యాసింజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది.టికెట్ బుకింగ్ విధానాన్ని మరింత ఈజీ చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టేషన్ అసోసియేషన్ సాయంతో న్యూ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్డీసీ టెక్నాలజీతో టికెట్ బుకింగ్ సేవలను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది. ఆఫర్లు, డీల్స్, యాడ్- ఆన్లు, అనుకూలమైన ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇకపై బుకింగ్ సమయంలోనే కనిపిస్తాయి.దీంతో ఆఫర్ల కోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. బుకింగ్ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఎయిర్లైన్స్ తెలిపింది. లేదా ఎన్డీసీ కస్టమర్ సపోర్ట్ సాయంతో వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







