ఎత్తైన భవనాలలో అగ్నిప్రమాదాలు.. డ్రోన్లతో మంటల అదుపు..!
- September 08, 2024
యూఏఈ: షార్జా సివిల్ డిఫెన్స్ వచ్చే ఏడాది నుండి ఎమిరేట్లోని ఎత్తైన భవనాలలో సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. కొత్త టెక్నాలజీని 2025 మొదటి త్రైమాసికంలో అమల్లోకి తేనుంది. దీని ద్వారా ఎత్తైన భవనాలలో జరిగే ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఏఈలో ఉన్న సివిల్ డిఫెన్స్..కంపెనీ డ్రోన్ ఫస్ట్ బిల్డింగ్ సర్వీసెస్కు చెందిన సాంకేతిక బృందంతో అథారిటీ డ్రోన్ను పరీక్షించింది. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సమీ అల్ నఖ్బీ మాట్లాడుతూ.. తాము డ్రోన్ను పరీక్షించామని ఇది కేవలం 18 సెకన్లలో 40 అంతస్తులకు సమానమైన 150 మీటర్ల ఎత్తుకు చేరుకున్న పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిందన్నారు. ఈ ఎత్తులో 5,000 లీటర్ల సామర్థ్యం కలిగిన అంతర్గత ట్యాంక్ నుండి 15 మీటర్ల వరకు నీటిని పిచికారీ చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించారని, ఇది గ్రౌండ్ ట్యాంక్కు అనుసంధానించబడిన నీటి గొట్టం ద్వారా రీఫిల్ చేయబడుతుందని వివరించారు. డ్రోన్లో థర్మల్ కెమెరా అమర్చబడి ఉంటుందని, ఇది ప్రమాద తీవ్రతను గుర్తించడంలో సహాయపడుతుందని, దీంతో మంటలను త్వరగా నియంత్రించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయని బ్రిగేడియర్ అల్ నక్బీ తెలిపారు. 27కిలోల బరువున్న ఈ డ్రోన్ బ్యాటరీ లేదా విద్యుత్తో పనిచేస్తంది. 12 గంటలపాటు నిరంతరాయంగా పనిచేయగలదని, రాత్రిపూట లైట్లు, హీట్ సెన్సార్లు, పారాచూట్లు పనిచేయక ఎమర్జెన్సీ ల్యాండింగ్కు వీలుగా ప్యారాచూట్ వ్యవస్థను ఇందులో అమర్చినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









