ఒక్క అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- September 09, 2024
యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లే పని వుండదంటారు. యాపిల్కే కాదండోయ్. అరటి పండుకి ఆ నియమం వర్తిస్తుంది. ఎందుకంటే అరటి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు మరి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.?
అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే ఒక్క అరటి పండు తినగానే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అలాగే చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది.
అంతే కాదు, వర్కవుట్లు చేసిన తర్వాత కూడా ఒక అరటి పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అధికంగా వుంటుంది. అందుకే అరటిపండు రోజూ తింటే ఎముకలు గట్టిపడతాయ్.
అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారింపు చేస్తాయ్. బరువు నియంత్రణలో వుండేందుకు కూడా అరటి పండు తోడ్పడుతుంది. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లకి అరటి పండు మంచి ఔషధం.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు అరటి పండు రోజూ తీసుకుంటే మంచిది. అరటి పండును రోజూ తీనుకునే వారు హృద్రోగాలకు దూరంగా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు.అరటి పండులోని ఫ్రక్టోస్, సుక్రోస్, గ్లూకోస్ వంటి చక్కెరలు అధికంగా వుంటాయ్. అందుకే డయాబెటిస్ వున్నవాళ్లు అరటిపండును కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది.
అరటి పండులో వుండే ట్రిఫ్టోఫాన్ అమైనోయాసిడ్, సిరటోనిన్గా మారుతుంది. అందుకే నిద్రలేమి వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధం. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తిని పడుకుంటే మంచి నిద్రకు ఉపక్రమించొచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







