ఒక్క అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- September 09, 2024
యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లే పని వుండదంటారు. యాపిల్కే కాదండోయ్. అరటి పండుకి ఆ నియమం వర్తిస్తుంది. ఎందుకంటే అరటి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు మరి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.?
అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే ఒక్క అరటి పండు తినగానే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అలాగే చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది.
అంతే కాదు, వర్కవుట్లు చేసిన తర్వాత కూడా ఒక అరటి పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అధికంగా వుంటుంది. అందుకే అరటిపండు రోజూ తింటే ఎముకలు గట్టిపడతాయ్.
అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారింపు చేస్తాయ్. బరువు నియంత్రణలో వుండేందుకు కూడా అరటి పండు తోడ్పడుతుంది. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లకి అరటి పండు మంచి ఔషధం.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు అరటి పండు రోజూ తీసుకుంటే మంచిది. అరటి పండును రోజూ తీనుకునే వారు హృద్రోగాలకు దూరంగా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు.అరటి పండులోని ఫ్రక్టోస్, సుక్రోస్, గ్లూకోస్ వంటి చక్కెరలు అధికంగా వుంటాయ్. అందుకే డయాబెటిస్ వున్నవాళ్లు అరటిపండును కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది.
అరటి పండులో వుండే ట్రిఫ్టోఫాన్ అమైనోయాసిడ్, సిరటోనిన్గా మారుతుంది. అందుకే నిద్రలేమి వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధం. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తిని పడుకుంటే మంచి నిద్రకు ఉపక్రమించొచ్చు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







