15 నుంచి సికింద్రాబాద్ మధ్య నాగపూర్ కు వందే భారత్ రైలు
- September 10, 2024
సికింద్రాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ కు మరో వందే భారత్ రైలు ను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుంచి ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది.
ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దీనిని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ వందే భారత్ రైలు నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలు దేరి.. మధ్యాహ్నం 12.15 గంటలకు కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మళ్ళీ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 కి నాగపూర్ చేరుకుంటుంది. కాగా కాజీపేట, రామగుండం, బళ్లార, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
సికింద్రాబాద్, నాగపూర్ నగరాల మధ్య 578 కిమీల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో చేరుకుంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా.. దీంతో ఐదు రైల్లు కానున్నాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









