వృద్ధుల హక్కులను కాలరాసే వారిపై భారీ జరిమానాలు..!!
- September 14, 2024
జెనీవా: వృద్ధుల మానవ హక్కులపై స్వతంత్ర నిపుణుడి నివేదికను GCC దేశాలు అంగీకరించాయి. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి HE డా. హెంద్ అబ్దుల్రహ్మాన్ అల్ ముఫ్తా.. GCC తరపున జెనీవాలో మానవ హక్కుల మండలి 57వ సెషన్లో భాగంగా ఈ మేరకు ప్రకటన చేశారు. వృద్ధులకు కచ్చితమైన పర్యవేక్షణ ప్రమాణాలను నిర్ధారించడం అత్యవసరమన్నారు. వారి ఆర్థిక, చట్టపరమైన హక్కులకు తీవ్రమైన చిక్కులను కలిగించే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వృద్ధులపై దోపిడీ, వివక్షను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వృద్ధుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరారు. GCC హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్తో సహా అన్ని జాతీయ సామూహిక చట్టాలు వృద్ధుల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







