ఒమన్ లో 9.3% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!
- September 15, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా జూలై 2024 నాటికి ప్రయాణికుల సంఖ్య 9.3 శాతం పెరిగింది. 63,219 విమానాల్లో 8,478,548 మంది ప్రయాణికులు ప్రయాణించారు. జూలై 20 నాటికి 59,778 విమానాల్లో 7,757,629 మంది ప్రయాణించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు తెలియజేశాయి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య గత జూలై చివరి నాటికి 7,571,148 మందికి చేరుకుంది. 8.9 శాతం పెరుగుదల నమోదైంది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చి వెళ్లే విమానాలలో 51,535 అంతర్జాతీయ విమానాలు, 6,948,193 మంది ప్రయాణీకులు నమోదు కాగా, ఇందులో 4,963 దేశీయ విమానాలు, 621,955 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య 827,486 మంది ప్రయాణీకులకు చేరుకుంది. జూలై 2023 ముగింపుతో పోలిస్తే ఇది 10.3 శాతం పెరిగింది. వారు 5,975 విమానాల్లో(3.6 శాతం పెరుగుదల) ప్రయాణించారు. సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 3,088 విమానాలకు చేరుకుంది. 392,098 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. దేశీయ విమానాల సంఖ్య 2,887 విమానాలకు చేరుకుంది.435,388 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. సోహార్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 384 విమానాల్లో 45,126 మంది ప్రయాణికులకు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 362 విమానాల్లో 34,788 మంది ప్రయాణికులకు చేరుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







