సెప్టెంబర్ 15తో ‘మిడ్ డే బ్రేక్’కు ఎండ్.. 99.9% విజయవంతం..!
- September 15, 2024
యూఏఈ: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడంపై నిషేధం సెప్టెంబర్ 15 తో ముగియనుంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకటించింది. 99.9 శాతం కంపెనీలలో ఈ కార్యక్రమం విజయవంతమైందని మోహ్రే తెలిపింది. డెలివరీ సర్వీస్ వర్కర్ల కోసం మధ్యాహ్న విరామ సమయంలో 6వేల రెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది., మంత్రిత్వ శాఖ సుమారు 1.34లక్షల తనిఖీలను నిర్వహించగా, కేవలం 51 ఉల్లంఘనలు మాత్రమే నమోదు అయినట్టు మోహ్రే చెకింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మోసిన్ అల్ నస్సీ వెల్లడించారు. మిడ్ డే బ్రేక్ చొరవ జూన్ 15 నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









