కువైట్ లో స్కూల్స్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు..!
- September 16, 2024
కువైట్: 500,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు, 105,000 మంది టీచర్లు, సిబ్బంది తిరిగే స్కూళ్లకు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహాలను పూర్తి చేసినట్టు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ఆధారంగా అరబిక్ పాఠశాలల్లో మొదటి గ్రేడ్ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. అయితే ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు సెప్టెంబర్ 17న, కిండర్ గార్టెన్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్నాయి. GPS ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విద్య మరియు అంతర్గత మంత్రిత్వ శాఖలు 2024-25 విద్యా సంవత్సరానికి ముందు రహదారి-అవగాహన మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం సెంటర్ ఫర్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ (CGC), సమాచార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. రహదారులపై రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







