మెంతులు జుట్టుకు చేసే మేలు తెలుసా.?
- September 17, 2024
మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల పాలిట మెంతులు వరంగానే చెబుతుంటారు. మెంతుల పొడిని ప్రతీరోజూ పరగడుపున వాటర్లో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో వుంటుందని నిపుణులు చెబుతారు.
అయితే, మెంతులు కేవలం డయాబెటిస్ వున్న వాళ్లకే కాదండోయ్. అందరూ తీసుకోవచ్చు ఆరోగ్యం పరంగా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెంతుల టిప్ కేవలం జుట్టు కోసమే.
ప్రస్తుత పరిస్థితుల్లో తెల్ల జుట్టు సమస్యతో పాటూ, జుట్టు రాలడం ప్రధాన సమస్యగా మారింది. తెల్ల జుట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. దాంతో, ఆ సమస్యను తప్పించుకోవడానికి టెంపరరీగా మార్కెట్లో లభించే హెయిర్ డైలను వాడి సైడ్ ఎఫెక్టుల బారిన పడుతున్నారు.
అయితే, మెంతులతో మనం చెప్పుకోబోయే టిప్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే హెయిర్కి మంచి న్యూట్రిషన్లను కూడా అందిస్తుంది. మాయిశ్చరైజర్లా పని చేస్తుంది.
తద్వారా ఆరోగ్యవంతమైన నల్లని జుట్టును సొంతం చేసుకోవచ్చు. అందుకు కావల్సినవి కొద్దిగా మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్ (మార్కెట్లో లభిస్తాయ్), కొబ్బరి నూనె.
ఓ పాత్రలో కావల్సిన కంటెంట్లో కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయాలి. నూనె మరుగుతున్న టైమ్లోనే మెంతులు, కలోంజీ సీడ్స్ ఈక్వెల్ రేషియోలో తీసుకుని వేడి చేయాలి. కొబ్బరి నూనె కలర్ మారేంత వరకూ ఇలా చేయాలి.
తర్వాత నూనెను చల్లార్చి దాన్ని తలకు పట్టించాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేసేస్తే సరిపోతుంది. లేదంటే రాత్రిపూట ఈ నూనె తలకు పట్టించి తెల్లవారి తల స్నానం చేసినా సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా తెల్ల జుట్టు సమస్యతో పాటూ జుట్టు రాలే సమస్య కూడా తీరిపోతుంది. ఆల్రెడీ వున్న తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటూ, కొత్తగా తెల్ల జుట్టు కూడా రాకుండా వుంటుంది. ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









