టాలీవుడ్లో చెల్లెలికి కూడా రంగం సిద్ధం చేస్తున్న జాన్వీ కపూర్.?
- September 17, 2024
అతిలోక సుందరిగా సౌత్, నార్త్లో పేరున్న నటి దివంగత శ్రీదేవి. హీరోయిన్లలో ఆమెకు సాటి ఆమెనే అంటే అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. కానీ, ఆమె ముద్దుల తనయల విషయంలో అలా జరగడం లేదు.
తల్లి లెగసీని నిలబెట్టడంలో కూతుళ్లు వెనకబడే వుండిపోయారు రేస్లో. జాన్వీ కపూర్ ఒకింత బెటరే అనొచ్చు. కానీ, శ్రీదేవిలా కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ అయితే జాన్వీ కపూర్ అందుకోలేకపోయింది.
విలక్షణ నటిగానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్లో సత్తా చాటిందింతవరకూ. ఇప్పుడే టాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీయార్తో ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
ఇక జాన్వీ సంగతిలా వుంటే, ఆమె సోదరి, శ్రీదేవి రెండో తనయ ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందనీ తాజా సమాచారం. ప్రస్తుతం జునైత్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది ఖుషీ కపూర్.
అన్నీ కలిసొస్తే, త్వరలోనే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి









