టాలీవుడ్లో చెల్లెలికి కూడా రంగం సిద్ధం చేస్తున్న జాన్వీ కపూర్.?
- September 17, 2024
అతిలోక సుందరిగా సౌత్, నార్త్లో పేరున్న నటి దివంగత శ్రీదేవి. హీరోయిన్లలో ఆమెకు సాటి ఆమెనే అంటే అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. కానీ, ఆమె ముద్దుల తనయల విషయంలో అలా జరగడం లేదు.
తల్లి లెగసీని నిలబెట్టడంలో కూతుళ్లు వెనకబడే వుండిపోయారు రేస్లో. జాన్వీ కపూర్ ఒకింత బెటరే అనొచ్చు. కానీ, శ్రీదేవిలా కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ అయితే జాన్వీ కపూర్ అందుకోలేకపోయింది.
విలక్షణ నటిగానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్లో సత్తా చాటిందింతవరకూ. ఇప్పుడే టాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీయార్తో ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
ఇక జాన్వీ సంగతిలా వుంటే, ఆమె సోదరి, శ్రీదేవి రెండో తనయ ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందనీ తాజా సమాచారం. ప్రస్తుతం జునైత్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది ఖుషీ కపూర్.
అన్నీ కలిసొస్తే, త్వరలోనే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!









