టాలీవుడ్లో చెల్లెలికి కూడా రంగం సిద్ధం చేస్తున్న జాన్వీ కపూర్.?
- September 17, 2024
అతిలోక సుందరిగా సౌత్, నార్త్లో పేరున్న నటి దివంగత శ్రీదేవి. హీరోయిన్లలో ఆమెకు సాటి ఆమెనే అంటే అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. కానీ, ఆమె ముద్దుల తనయల విషయంలో అలా జరగడం లేదు.
తల్లి లెగసీని నిలబెట్టడంలో కూతుళ్లు వెనకబడే వుండిపోయారు రేస్లో. జాన్వీ కపూర్ ఒకింత బెటరే అనొచ్చు. కానీ, శ్రీదేవిలా కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ అయితే జాన్వీ కపూర్ అందుకోలేకపోయింది.
విలక్షణ నటిగానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్లో సత్తా చాటిందింతవరకూ. ఇప్పుడే టాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీయార్తో ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
ఇక జాన్వీ సంగతిలా వుంటే, ఆమె సోదరి, శ్రీదేవి రెండో తనయ ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందనీ తాజా సమాచారం. ప్రస్తుతం జునైత్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది ఖుషీ కపూర్.
అన్నీ కలిసొస్తే, త్వరలోనే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!