హైదరాబాద్లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
- September 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై నగర సీపీ సీవీ ఆనంద్ వివరాలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిందని, ఉదయం 10.30 గంటలకే అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు.
ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని, సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు. ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి పోలీసుకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని అన్నారు.
ఇవాళ వర్కింగ్ డే కాబట్టి, విగ్రహాలను తీసుకెళ్లేవారు ప్రజలకి సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వళ్ల నిమజ్జనం కొంత ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే ఉదయం 7 గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేదని వివరించారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్లోనే లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









