హైదరాబాద్లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
- September 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై నగర సీపీ సీవీ ఆనంద్ వివరాలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిందని, ఉదయం 10.30 గంటలకే అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు.
ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని, సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు. ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి పోలీసుకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని అన్నారు.
ఇవాళ వర్కింగ్ డే కాబట్టి, విగ్రహాలను తీసుకెళ్లేవారు ప్రజలకి సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వళ్ల నిమజ్జనం కొంత ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే ఉదయం 7 గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేదని వివరించారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్లోనే లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









