హైదరాబాద్లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
- September 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై నగర సీపీ సీవీ ఆనంద్ వివరాలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిందని, ఉదయం 10.30 గంటలకే అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు.
ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని, సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు. ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి పోలీసుకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని అన్నారు.
ఇవాళ వర్కింగ్ డే కాబట్టి, విగ్రహాలను తీసుకెళ్లేవారు ప్రజలకి సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వళ్ల నిమజ్జనం కొంత ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే ఉదయం 7 గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేదని వివరించారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్లోనే లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందని తెలిపారు.
తాజా వార్తలు
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!









