ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణం
- July 05, 2015
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు తమ దారుణాలు చూపించే మరో వీడియోను విడుదల చేశారు. 25 మంది వరకు ప్రభుత్వ ఫోర్సెస్ను నిర్దాక్షిణ్యింగా చంపేశారు. సెంట్రల్ సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరాలో ఈ సంఘటన జరిగింది. పాల్మీరాలోని మిలిన్నా ఓల్డ్ ఓయాసిస్లో గల ప్రాచీన రోమన్ థియేటర్లో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం చెప్పింది. ప్రస్తుతం ఆ థియేటర్ ఐసిస్ మిలిటెంట్ చేతుల్లో ఉంది. మే నెల నుండి అది వారి చేతుల్లోనే ఉంది. వీడియోలో... సైనికులను మోకాళ్ల పైన కూర్చుండబెట్టారు. వారి ముఖాలకు మాస్కులు వేశారు. వారి పక్కన ఐసిస్ ఉగ్రవాదులు నిలుచున్నారు. వారి తలలకు తుపాకులు పెట్టారు. ఈ హత్యాకాండ మే 27వ తేదీన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







