ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణం
- July 05, 2015
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు తమ దారుణాలు చూపించే మరో వీడియోను విడుదల చేశారు. 25 మంది వరకు ప్రభుత్వ ఫోర్సెస్ను నిర్దాక్షిణ్యింగా చంపేశారు. సెంట్రల్ సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరాలో ఈ సంఘటన జరిగింది. పాల్మీరాలోని మిలిన్నా ఓల్డ్ ఓయాసిస్లో గల ప్రాచీన రోమన్ థియేటర్లో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం చెప్పింది. ప్రస్తుతం ఆ థియేటర్ ఐసిస్ మిలిటెంట్ చేతుల్లో ఉంది. మే నెల నుండి అది వారి చేతుల్లోనే ఉంది. వీడియోలో... సైనికులను మోకాళ్ల పైన కూర్చుండబెట్టారు. వారి ముఖాలకు మాస్కులు వేశారు. వారి పక్కన ఐసిస్ ఉగ్రవాదులు నిలుచున్నారు. వారి తలలకు తుపాకులు పెట్టారు. ఈ హత్యాకాండ మే 27వ తేదీన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









