దుబాయ్ లో 3,800 ఈ-స్కూటర్లు, బైక్లు స్వాధీనం..!!
- September 22, 2024
దుబాయ్: భద్రతా ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసులు దాదాపు 3,800 ఈ-స్కూటర్లు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ రోడ్లలో ఉపయోగించడంతో సహా వివిధ ఉల్లంఘనల నేపథ్యంలో సుమారు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లు, ఇ-బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 2,286 సైకిళ్లు, 771 ఈ-బైక్లు, 722 స్కూటర్లు సహా మొత్తం 3,779 స్వాధీనం చేసుకున్నట్లు నైఫ్ పోలీస్ స్టేషన్ తాత్కాలిక డైరెక్టర్ బ్రిగ్ ఒమర్ ముసా అషూర్ వెల్లడించారు.
స్కూటర్లు, ఎలక్ట్రిక్ లేదా సాధారణ సైకిళ్లను నడుపుతున్నప్పుడు భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు. అనుమతి లేని లేన్లలో నడపడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్లను ఉపయోగించడం, ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ వస్తువులను తీసుకెళ్లడం చేయవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ఫోన్ యాప్లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా 901లో "వి ఆర్ ఆల్ పోలీస్" సేవకు కాల్ చేయడం ద్వారా ప్రతికూల ప్రవర్తనలు లేదా ప్రమాదకరమైన చర్యలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







