24న విడుదల కానున్న 'జక్కన్న' సినిమా ఆడియో
- June 20, 2016
సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి మెదటి లుక్ టీజర్ ని విడుదల చేయటం జరిగింది. విడుదలయ్యిన మెదటిరోజునే 100000 వీవ్స్ రావటం ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు ఏరేంజిలో వున్నాయో తెలుస్తుంది. సునీల్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ లో చివరి పంచ్ సోషల్ మీడియాలో వివరీతంగా వైరల్ కావటం విశేషం. ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఈచిత్రంలో చాలా వున్నాయి. రక్ష చిత్రం దర్శకుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.
దినేష్ అందించిన ఆడియోని ఈనెల 24 న అభిమానులు, ప్రేక్షకుల మరియు సినిపెద్దల సమక్షంలో విడుదల చేస్తున్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జక్కన్న చిత్రం. సునీల్ పెర్ ఫార్మెన్స్ లో అన్ని రకాల షెడ్స్ వుంటాయి. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైరక్టర్ వంశి రాసిన సీన్ కి ధియోటర్స్ లో క్లాప్స్ పడతాయి. దీనికి ఉదాహరణ రీసెంట్ గా రిలీజయ్యిన టీజర్ లొ చివరి పంచ్ గురించి మాకు వస్తున్న కాల్స్. అంతగా మా టీజర్ ప్రేక్షకుల్లో కి వెల్లిపోయింది.
అదే విధంగా దినేష్ గారు అందిచిన ఆడియో కూడా ఫుల్ ఎనర్జిగా వుంటాయి. అన్ని పాటలు పాడుకునేలా వుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మా చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు చాలా వుంటాయి. హీరోయిన్ మన్నార్ చోప్రా పాత్ర కూడా చాలా అందంగా తీర్చిదిద్దాడు మా దర్శకుడు. అలాగే మా చిత్రం ప్రేమకథా చిత్రం లో సప్తగిరి ఏ రేంజిలో నవ్వించాడో ఈ చిత్రంలో దాన్ని మించి నవ్విస్తాడు. సప్తగిరి మంచి గెటప్ లో కనిపిస్తాడు. ఆడయోని 24 న విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని జులై లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







