వారెవ్వా.! సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన నిఖిల్.!
- October 07, 2024
‘కార్తికేయ’ సినిమాలతో పాటూ ఆ తర్వాత ‘18 పేజెస్’ వంటి సూపర్ హిట్స్తో దూకుడు మీదున్న నిఖిల్ సిద్దార్ధ్ ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే పీరియాడిక్ మూవీతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్లోకి మారిపోయాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిఖిల్కి సంబంధించిన అప్డేట్ అంటే ఇదే ఇంతవరకూ. కానీ, లేటెస్ట్గా మరో అప్డేట్ నిఖిల్ ప్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.
ఇదేంటనుకుంటున్నారా.? నిఖిల్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం టైటిల్. అవునండీ నిజమే.! ‘స్వయంభూ’ సినిమా కన్నా ముందే నిఖిల్ ఈ సినిమాని పూర్తి చేసేశాడు. ఈ సినిమాలో దిశ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా వెరీ లేటెస్ట్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్లు ప్రకటించారు. దీపావళికి ఈ సినిమా రిలీజ్ కానుందని తాజా అనౌన్స్మెంట్.
అయితే, ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేశాడబ్బా నిఖిల్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, ‘కార్తికేయ 2’ టైమ్లోనే ఈ సినిమా పూర్తయిపోయిందట. కానీ, సినిమాకి సంబంధించి ఇన్నాళ్లలో ఎప్పుడూ ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఒకింత ఆశ్చర్యమే. ఏది ఏమైతేనేం, సినిమా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయ్యిందిగా.! ఫ్యాన్స్ హ్యాపీ హ్యాపీ.!
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









