‘బిగ్’ హౌస్లో ఇక నుంచి రచ్చ రచ్చే.!
- October 07, 2024
చాలా చప్పగా స్టార్ట్ అయిన బిగ్బాస్ తెలుగు 8 వ సీజన్ని సడెన్గా కలర్ ఫుల్గా భారీ ఎంటర్టైనర్గా మార్చేశారు.
ఐదు వారాల ఎలిమినేషన్ల తర్వాత హౌస్ని సరికొత్తగా రూపొందించబోతున్నారు. పాత కంటెస్టెంట్స్లో అల్టిమేట్ ఎంటర్టైనర్స్ని ఏరి కోరి ఎంచి హౌస్లోకి పంపించారు.
ఇంకేముంది.! ఇక రేపటి నుంచి రచ్చ రచ్చే. ఆల్రెడీ బిగ్బాస్ హౌస్కి సుపరిచితులైన పాత కంటెస్టెంట్లు అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, నయనీ పావనీ, డాక్టర్ గౌతమ్, హరితేజ, డాన్సింగ్ సెన్సేషన్ మెహబూబ్, యూ ట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ ఇలా ఎనిమిది మంది ఎక్స్ట్రా కంటెస్టెంట్లను ప్రవేశ పెట్టారు.
ఆల్రెడీ తాజాగా నైనిక ఎలిమినేషన్తో ఎనిమిది మంది కరెంట్ కంటెస్టెంట్లు.. మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన పాత కంటెస్టెంట్లతో ఇకపై హౌస్లో ఎంటర్టైన్మెంట్ రూపు మారిపోనుంది.
ఈ తాజా పరిణామంతో బిగ్బాస్ ప్రేక్షకులు హమ్యయ్యా మళ్లీ బిగ్బాస్కి ఊపిరొచ్చింది.. అంటూ వాళ్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, రాయల్ ఛాలెంజర్స్ అనే టీమ్స్తో బిగ్బాస్ వీరిని సంబోధిస్తూ వీరితో ఇకపై హౌస్లో చేయించబోయే రచ్చ ఎలా వుండబోతోందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









