పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణ.. జిసిసి దేశాల మినిస్టర్స్ పిలుపు..!!
- October 07, 2024
దోహా: దోహాలో జరిగిన జిసిసి దేశాల ఇస్లామిక్ అఫైర్స్ ఎండోమెంట్స్ మంత్రుల 10వ సమావేశానికి ఖతార్ అధ్యక్షత వహించింది. ప్రారంభ సెషన్కు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి హెచ్ఇ ఘనేమ్ బిన్ షాహీన్ బిన్ ఘనేమ్ అల్ ఘనీమ్ అధ్యక్షత వహించగా..జిసిసి దేశాల మంత్రులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రపంచ ఎండోమెంట్స్ దినోత్సవాన్ని ప్రకటించడం, గల్ఫ్ సైంటిఫిక్ అబ్జర్వేటరీని స్థాపించడం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఎండోమెంట్స్, మసీదులు, న్యాయవాద, పరిశోధన, వికలాంగుల సంరక్షణ, కుటుంబ రక్షణ, చారిత్రక సంరక్షణ వంటి ప్రత్యేకతలను లక్ష్యంగా పెట్టుకున్నాయని అల్ ఘనీమ్ అన్నారు. పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. అల్ అక్సా మసీదుపై దాడులను తీవ్రంగా ఖండించారు. మిడిల్ లిస్ట్ దేశాలలో శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు సహకారం అందించడానికి ముందుకు రావాలని ఇజ్రాయిల్ దురాగతాలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









