పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణ.. జిసిసి దేశాల మినిస్టర్స్ పిలుపు..!!
- October 07, 2024
దోహా: దోహాలో జరిగిన జిసిసి దేశాల ఇస్లామిక్ అఫైర్స్ ఎండోమెంట్స్ మంత్రుల 10వ సమావేశానికి ఖతార్ అధ్యక్షత వహించింది. ప్రారంభ సెషన్కు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి హెచ్ఇ ఘనేమ్ బిన్ షాహీన్ బిన్ ఘనేమ్ అల్ ఘనీమ్ అధ్యక్షత వహించగా..జిసిసి దేశాల మంత్రులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రపంచ ఎండోమెంట్స్ దినోత్సవాన్ని ప్రకటించడం, గల్ఫ్ సైంటిఫిక్ అబ్జర్వేటరీని స్థాపించడం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఎండోమెంట్స్, మసీదులు, న్యాయవాద, పరిశోధన, వికలాంగుల సంరక్షణ, కుటుంబ రక్షణ, చారిత్రక సంరక్షణ వంటి ప్రత్యేకతలను లక్ష్యంగా పెట్టుకున్నాయని అల్ ఘనీమ్ అన్నారు. పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. అల్ అక్సా మసీదుపై దాడులను తీవ్రంగా ఖండించారు. మిడిల్ లిస్ట్ దేశాలలో శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు సహకారం అందించడానికి ముందుకు రావాలని ఇజ్రాయిల్ దురాగతాలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







