ఒమాన్ లో ఉపవాసం - అనంతరం భుక్తాయాసం!
- July 06, 2015
సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ లో, పవిత్ర రమదాన్ మాసంలో డజన్ల కొద్దీ ప్రజలు రోజూ అతిభోజనం వలన ఆసుపత్రుల పాలౌుతున్నారని రువి లోని బద్ర్ అల్ సమా సీనియర్ ఇంటర్నిస్ట్ ఏ బషీర్ తెలిపారు. చాలా సేపు ఉపవాసం చేసిన మీదట భోజనంపై అధిక మక్కువ కలగడం సహజమేనని, ఐతే అతిగా తినడం వలన గ్యాస్ట్రొ-ఇంటస్టైనల్ సమస్యలు సంభవిస్తాయని ఎంత హెచ్చరించినా వినకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని, ఇది ప్రవక్త చెప్పిన పద్ధతి కాదని అట్లాస్ హాస్పిటల్ వైద్యుడు డా. వి. సి. పి. మొహమ్మద్, KIMS హాస్పిటల్ మెడికల్ సుపరింటెండంట్ శశి రాజ్ తో సహా పలువురు వైద్యులు తెలిపారు.
వారు రమదాన్ ఉపవాస సందర్భంగా పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇలా చెప్పారు:-
1.ఇఫ్తార్ విందును రెండు భాగాలుగా విడదీసి ఆరగించండి; తరువాత పండ్లు వంటివి, చివరగా సుహూర్ ను తీసుకోండి.
2. ఆహారాన్ని మెల్లిగా నమిలి తినండి.
3. భోజనంతో పాటుగా కాకుండా, తరువాత నీళ్ళు తాగండి.
4. జీర్ణవ్యవస్థకు సహాయపడేలా - కేఫీన్ రహిత హెర్బల్ టీలను సేవించండి.
5.అతిగా కాఫీ, టీ సేవనం వల్ల ఉదర సమస్యలు ఎక్కువౌతాయి.
6. అతిగా కొవ్వు కలిగిన వేపుల్లు, మసాలా పదార్ధాలు, టమాటాసాస్ వంటివి ఉపవాసానంతరం సేవించడం, కడుపు నొప్పికి కారణమౌతుంది.
7. పచ్చి కూరగాయలు వంటివి కడుపు ఉబ్బరానికి కారణమౌతాయి; వాటి బదులుగా ఉడికిన కూరగాయలు తినండి.
8. ఇఫ్తార్ ముగిసిన వెనువెంటనే నిద్ర పోతే, అసిడిటీ పెరిగి కడుపులో అసౌకర్యానికి కారణమౌతుంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







