న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్కు అమెరికా మద్దతు
- June 21, 2016
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. అమెరికా మాత్రం తన మద్దతును కొనసాగిస్తోంది. త్వరలో సియోల్లో జరగనున్న ఎన్ఎస్జీ సమావేశంలో భారత సభ్యత్వానికి సంబంధించిన బిడ్కు మద్దతు తెలపాలని అమెరికా ఎన్ఎస్జీ సభ్యదేశాలను కూడా కోరింది. 'భారత్కు మద్దతునివ్వాలన్నది అమెరికా పాలసీ.. భారత్ ఎన్ఎస్జీలో స్థానానికి సిద్ధంగా ఉంది. మేము ఎన్ఎస్జీ ప్లీనరీలో భారత దరఖాస్తుకు మద్దతునిస్తాము' అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జోస్ ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో దీనిలో పాల్గొనే ప్రభుత్వాలు కూడా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని, అందుకు భారత్ తరపున అమెరికా వకాల్తా తీసుకొంటుందని ఆయన చెప్పారు.
సోమవారం నుంచి ఐదురోజుల పాటు దక్షిణ కొరియాలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 48 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







