రాబోయే రోజుల్లో బంగారం ధరలకు రెక్కలు.. $3,000కి చేరుకుంటుందా..?
- October 09, 2024
యూఏఈ: రాబోయే నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయని, ఈ ఏడాది ఔన్సుకు $2,700.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి $3,000 స్థాయిని అధిగమిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తత, వడ్డీ రేట్ల తగ్గింపు, చైనా నుండి డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు, రాబోయే యుఎస్ ఎన్నికలు రాబోయే నెలల్లో బంగారం ధరలను నిర్దేశిస్తాయన్నారు. యూఏఈలో ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు స్వల్పంగా పెరిగి 2,644.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, US ఫెడరల్ రిజర్వ్ మరింత వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా గత నెలలో ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,670కి చేరుకుంది. “వివిధ కారణాల వల్ల బంగారం ఫ్యాషన్గా మారింది. కేంద్ర బ్యాంకులు డాలర్ స్థానంలో బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. బంగారంలోకి పెద్ద మొత్తంలో మూలధన ప్రవాహం ఉంది.”అని నూర్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ లీల్ కామెజో అన్నారు. గోల్డ్మన్ సాచ్స్ బంగారం లక్ష్యాన్ని $2,700గా నిర్ణయించిందన్నారు. ఇటీవల దానిని $2,900కి పెంచింది. 2025 మొదటి త్రైమాసికంలో బంగారం 3,000 డాలర్లను తాకుతుందని నేను భావిస్తున్నట్టు అని XS.comలో సీనియర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎలీ నాచావతి వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







