రాబోయే రోజుల్లో బంగారం ధరలకు రెక్కలు.. $3,000కి చేరుకుంటుందా..?
- October 09, 2024
యూఏఈ: రాబోయే నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయని, ఈ ఏడాది ఔన్సుకు $2,700.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి $3,000 స్థాయిని అధిగమిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తత, వడ్డీ రేట్ల తగ్గింపు, చైనా నుండి డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు, రాబోయే యుఎస్ ఎన్నికలు రాబోయే నెలల్లో బంగారం ధరలను నిర్దేశిస్తాయన్నారు. యూఏఈలో ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు స్వల్పంగా పెరిగి 2,644.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, US ఫెడరల్ రిజర్వ్ మరింత వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా గత నెలలో ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,670కి చేరుకుంది. “వివిధ కారణాల వల్ల బంగారం ఫ్యాషన్గా మారింది. కేంద్ర బ్యాంకులు డాలర్ స్థానంలో బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. బంగారంలోకి పెద్ద మొత్తంలో మూలధన ప్రవాహం ఉంది.”అని నూర్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ లీల్ కామెజో అన్నారు. గోల్డ్మన్ సాచ్స్ బంగారం లక్ష్యాన్ని $2,700గా నిర్ణయించిందన్నారు. ఇటీవల దానిని $2,900కి పెంచింది. 2025 మొదటి త్రైమాసికంలో బంగారం 3,000 డాలర్లను తాకుతుందని నేను భావిస్తున్నట్టు అని XS.comలో సీనియర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎలీ నాచావతి వివరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









