ఫ్రీ హోల్డ్ ప్రాంతానికి అదనపు ప్లాట్లు
- June 21, 2016
దుబాయ్లోని వలసవాదుల కోసం దుబాయ్ సెంట్రల్లోని ఫ్రీ హోల్డ్ ఏరియాకి అదనంగా కొన్ని ప్లాట్లను ఏర్పాటు చేస్తూ కొత్త రిజల్యూషన్ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ విడుదల చేశారు. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఏరియాలోని ప్లాట్ నెంబర్లు 205, 206 మరియు 207లపై యూఏఈ వాసులు కానివారికి ఓనర్షిప్ హక్కుల్ని, ఎలాంటి కాలపరిమితి లేకుండా మంజూరు చేసినట్లయ్యింది ఈ నిర్ణయంతో. 99 ఏళ్ళకు మించని లీజ్ పరమితితో ఈ ప్లాట్లకు ఓనర్షిప్ కలిగి ఉంటుంది. వీటికి సంబంధించిన సరిహద్దుల్ని మ్యాప్లో పూర్తిగా పొందు పరిచారు. దుబాయ్ ఏవియేషన్ సెక్టార్ అభివద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఏవియేషన్ సంబంధిత విభాగాల్లో దుబాయ్ డెస్టినేషన్ ఆఫ్ ఛాయిస్గా ఈవెంట్ ఆర్గనైజర్స్ భావించేలా ఈ నిర్ణయం దోహదపడుతుంది. అధికారిక గెజిట్లో పబ్లిష్ అయిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







