ఒలియాండర్ మొక్కల పెంపకాన్ని నిషేధం.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిక..!!
- October 09, 2024
యూఏఈ: అబుదాబి అథారిటీ ఎమిరేట్లో ఒలియాండర్ ప్లాంట్ ఉత్పత్తి, సాగు, ప్రచారం, వ్యాపారంపై నిషేధం విధించారు. విషపూరిత ఒలియాండర్ మొక్కను తినడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ఈ విషపూరిత మొక్కలోని ఏదైనా భాగాన్ని తినడం వల్ల కలిగే విషపూరిత ప్రమాదాల నుండి సమాజంలోని సభ్యులను, ముఖ్యంగా పిల్లలను, అలాగే పరిసర వాతావరణంలోని జంతువులను రక్షించడం ఈ చర్య లక్ష్యం అని అథారిటీ తెలిపింది. ఎమిరేట్లోని పౌరులు, నివాసితులు సంబంధిత అధికారులతో సహకరించాలని, ఒలియాండర్ ప్లాంట్ను సురక్షితంగా పారవేయాలని అథారిటీ పిలుపునిచ్చింది. తెలియని మొక్కను తాకడం లేదా తినకూడదని ప్రజలను హెచ్చరించింది. ఏదైనా తెలియని మొక్కను తినడం లేదా తాకడం వల్ల ప్రమాదం సంభవించినట్లయితే, టోల్ ఫ్రీ నంబర్ 800424ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







