ఒలియాండర్ మొక్కల పెంపకాన్ని నిషేధం.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిక..!!
- October 09, 2024
యూఏఈ: అబుదాబి అథారిటీ ఎమిరేట్లో ఒలియాండర్ ప్లాంట్ ఉత్పత్తి, సాగు, ప్రచారం, వ్యాపారంపై నిషేధం విధించారు. విషపూరిత ఒలియాండర్ మొక్కను తినడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ఈ విషపూరిత మొక్కలోని ఏదైనా భాగాన్ని తినడం వల్ల కలిగే విషపూరిత ప్రమాదాల నుండి సమాజంలోని సభ్యులను, ముఖ్యంగా పిల్లలను, అలాగే పరిసర వాతావరణంలోని జంతువులను రక్షించడం ఈ చర్య లక్ష్యం అని అథారిటీ తెలిపింది. ఎమిరేట్లోని పౌరులు, నివాసితులు సంబంధిత అధికారులతో సహకరించాలని, ఒలియాండర్ ప్లాంట్ను సురక్షితంగా పారవేయాలని అథారిటీ పిలుపునిచ్చింది. తెలియని మొక్కను తాకడం లేదా తినకూడదని ప్రజలను హెచ్చరించింది. ఏదైనా తెలియని మొక్కను తినడం లేదా తాకడం వల్ల ప్రమాదం సంభవించినట్లయితే, టోల్ ఫ్రీ నంబర్ 800424ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









