ఒలియాండర్ మొక్కల పెంపకాన్ని నిషేధం.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిక..!!
- October 09, 2024
యూఏఈ: అబుదాబి అథారిటీ ఎమిరేట్లో ఒలియాండర్ ప్లాంట్ ఉత్పత్తి, సాగు, ప్రచారం, వ్యాపారంపై నిషేధం విధించారు. విషపూరిత ఒలియాండర్ మొక్కను తినడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ఈ విషపూరిత మొక్కలోని ఏదైనా భాగాన్ని తినడం వల్ల కలిగే విషపూరిత ప్రమాదాల నుండి సమాజంలోని సభ్యులను, ముఖ్యంగా పిల్లలను, అలాగే పరిసర వాతావరణంలోని జంతువులను రక్షించడం ఈ చర్య లక్ష్యం అని అథారిటీ తెలిపింది. ఎమిరేట్లోని పౌరులు, నివాసితులు సంబంధిత అధికారులతో సహకరించాలని, ఒలియాండర్ ప్లాంట్ను సురక్షితంగా పారవేయాలని అథారిటీ పిలుపునిచ్చింది. తెలియని మొక్కను తాకడం లేదా తినకూడదని ప్రజలను హెచ్చరించింది. ఏదైనా తెలియని మొక్కను తినడం లేదా తాకడం వల్ల ప్రమాదం సంభవించినట్లయితే, టోల్ ఫ్రీ నంబర్ 800424ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి