ఫుజైరాలో కొత్త ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలు స్టేషన్..!!
- October 09, 2024
యూఏఈ: ఎతిహాద్ రైలు కొత్త ప్యాసింజర్ స్టేషన్ ఫుజైరాకు రానుంది. ఈ మేరకు అబుదాబిలో ప్రారంభమైన మొట్టమొదటి గ్లోబల్ రైల్ సదస్సులో ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. "మేము 11 నగరాలు ప్రాంతాలను కలుపుతున్నాము" అని ఎతిహాద్ రైల్లో పబ్లిక్ పాలసీ అండ్ సస్టైనబిలిటీ డైరెక్టర్ అధ్రా అల్మన్సూరి అన్నారు. “మేము ఇప్పటికే రెండు ప్యాసింజర్ స్టేషన్లను ప్రకటించాము. మొదటిది ఫుజైరాలోని సకంకంలో, రెండవది షార్జా యూనివర్శిటీ సిటీలో వస్తుందన్నారు. తమ ప్యాసింజర్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 200కిమీ ఉంటుందని, 2030 నాటికి 36 మిలియన్ల మంది ప్రయాణీకులను రవాణా చేయాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు. 900 కి.మీ పొడవున్న ఎతిహాద్ రైలు, మొత్తం ఏడు ఎమిరేట్స్ 11 ప్రధాన నగరాలను ఘువైఫాత్ నుండి ఫుజైరా వరకు కలుపుతుంది. హఫీత్ రైల్ అనే కంపెనీని స్థాపించామని.. ఇది ముబాదాలా, ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ మధ్య జాయింట్ వెంచర్ అని అల్మన్సూరి వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







