ఫుజైరాలో కొత్త ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలు స్టేషన్..!!
- October 09, 2024
యూఏఈ: ఎతిహాద్ రైలు కొత్త ప్యాసింజర్ స్టేషన్ ఫుజైరాకు రానుంది. ఈ మేరకు అబుదాబిలో ప్రారంభమైన మొట్టమొదటి గ్లోబల్ రైల్ సదస్సులో ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. "మేము 11 నగరాలు ప్రాంతాలను కలుపుతున్నాము" అని ఎతిహాద్ రైల్లో పబ్లిక్ పాలసీ అండ్ సస్టైనబిలిటీ డైరెక్టర్ అధ్రా అల్మన్సూరి అన్నారు. “మేము ఇప్పటికే రెండు ప్యాసింజర్ స్టేషన్లను ప్రకటించాము. మొదటిది ఫుజైరాలోని సకంకంలో, రెండవది షార్జా యూనివర్శిటీ సిటీలో వస్తుందన్నారు. తమ ప్యాసింజర్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 200కిమీ ఉంటుందని, 2030 నాటికి 36 మిలియన్ల మంది ప్రయాణీకులను రవాణా చేయాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు. 900 కి.మీ పొడవున్న ఎతిహాద్ రైలు, మొత్తం ఏడు ఎమిరేట్స్ 11 ప్రధాన నగరాలను ఘువైఫాత్ నుండి ఫుజైరా వరకు కలుపుతుంది. హఫీత్ రైల్ అనే కంపెనీని స్థాపించామని.. ఇది ముబాదాలా, ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ మధ్య జాయింట్ వెంచర్ అని అల్మన్సూరి వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి