కువైట్లో భారతీయ పర్యాటకం.. ఎంబసీ ఆధ్వర్యంలో ఈవెంట్..!!
- October 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కువైట్లోని మిలీనియం హోటల్ & కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 8న భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి B2B నెట్వర్కింగ్ ఈవెంట్ను నిర్వహించింది. భారతదేశంలోని టూరిజం పరిశ్రమకు చెందిన 10 ప్రముఖ సంస్థలతో కూడిన ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.ఈ కార్యక్రమాన్ని H.E షేఖా ఇంతిసార్ సలేం అల్-అలీ అల్-సబా, కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.షేఖా ఇంతిసార్ అల్-సబా రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించే చొరవను స్వాగతించారు. హిల్-స్టేషన్ల నుండి బీచ్ల నుండి క్రూయిజ్లు, అడ్వెంచర్ టూరిజం, మెడికల్ టూరిజం, యోగా టూరిజం, వైల్డ్ లైఫ్, లగ్జరీ టూరిజం వంటి టూరిజం అంశాలను హైలైట్ చేశారు. యునెస్కో ఆమోదించిన 43 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఇండియా కలిగి ఉందన్నారు. గత సంవత్సరం ఎంబసీ ద్వారా 8000కు పైగా బహుళ-ప్రవేశ పర్యాటక వీసాలు జారీ చేసినట్టు తెలిపారు. భారతదేశంలో విదేశీ పర్యాటకుల (FTAలు) సంఖ్య 2023లో 9.24 మిలియన్లతో వేగంగా పెరుగుతోందన్నారు. 2028 నాటికి 30.5 మిలియన్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కువైట్లోని 100 మంది టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







