కువైట్లో భారతీయ పర్యాటకం.. ఎంబసీ ఆధ్వర్యంలో ఈవెంట్..!!
- October 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కువైట్లోని మిలీనియం హోటల్ & కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 8న భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి B2B నెట్వర్కింగ్ ఈవెంట్ను నిర్వహించింది. భారతదేశంలోని టూరిజం పరిశ్రమకు చెందిన 10 ప్రముఖ సంస్థలతో కూడిన ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.ఈ కార్యక్రమాన్ని H.E షేఖా ఇంతిసార్ సలేం అల్-అలీ అల్-సబా, కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.షేఖా ఇంతిసార్ అల్-సబా రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించే చొరవను స్వాగతించారు. హిల్-స్టేషన్ల నుండి బీచ్ల నుండి క్రూయిజ్లు, అడ్వెంచర్ టూరిజం, మెడికల్ టూరిజం, యోగా టూరిజం, వైల్డ్ లైఫ్, లగ్జరీ టూరిజం వంటి టూరిజం అంశాలను హైలైట్ చేశారు. యునెస్కో ఆమోదించిన 43 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఇండియా కలిగి ఉందన్నారు. గత సంవత్సరం ఎంబసీ ద్వారా 8000కు పైగా బహుళ-ప్రవేశ పర్యాటక వీసాలు జారీ చేసినట్టు తెలిపారు. భారతదేశంలో విదేశీ పర్యాటకుల (FTAలు) సంఖ్య 2023లో 9.24 మిలియన్లతో వేగంగా పెరుగుతోందన్నారు. 2028 నాటికి 30.5 మిలియన్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కువైట్లోని 100 మంది టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







