ఫార్మ్ పై రైడ్.. 12 మిలియన్ దిర్హామ్ విలువైన పొగాకు సీజ్..!!
- October 11, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై అధికారులు రైడ్ చేశారు. అక్కడ నిల్వచేసిన సుమారు 7,195 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ Dh12 మిలియన్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) సహకారంతో రస్ అల్ ఖైమాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (DED) అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు. దీంతోపాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తులందరికీ DED జరిమానాలు విధించింది. విచారణలో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన లైసెన్స్లు లేకుండా కొన్ని నెలలుగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మికులు అంగీకరించారని RAK DEDలోని కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. వినియోగదారులను రక్షించేందుకు వాణిజ్య నియంత్రణ బృందం ఏడాది పొడవునా తన తనిఖీలను కొనసాగిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









