ఫార్మ్ పై రైడ్.. 12 మిలియన్ దిర్హామ్ విలువైన పొగాకు సీజ్..!!
- October 11, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై అధికారులు రైడ్ చేశారు. అక్కడ నిల్వచేసిన సుమారు 7,195 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ Dh12 మిలియన్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) సహకారంతో రస్ అల్ ఖైమాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (DED) అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు. దీంతోపాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తులందరికీ DED జరిమానాలు విధించింది. విచారణలో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన లైసెన్స్లు లేకుండా కొన్ని నెలలుగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మికులు అంగీకరించారని RAK DEDలోని కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. వినియోగదారులను రక్షించేందుకు వాణిజ్య నియంత్రణ బృందం ఏడాది పొడవునా తన తనిఖీలను కొనసాగిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి