ఫార్మ్ పై రైడ్.. 12 మిలియన్ దిర్హామ్ విలువైన పొగాకు సీజ్..!!
- October 11, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై అధికారులు రైడ్ చేశారు. అక్కడ నిల్వచేసిన సుమారు 7,195 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ Dh12 మిలియన్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) సహకారంతో రస్ అల్ ఖైమాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (DED) అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు. దీంతోపాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తులందరికీ DED జరిమానాలు విధించింది. విచారణలో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన లైసెన్స్లు లేకుండా కొన్ని నెలలుగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మికులు అంగీకరించారని RAK DEDలోని కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. వినియోగదారులను రక్షించేందుకు వాణిజ్య నియంత్రణ బృందం ఏడాది పొడవునా తన తనిఖీలను కొనసాగిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







