ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

- June 21, 2016 , by Maagulf
ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-34 విజయవంతం కావటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. ''20 ఉప గ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప గ్రహాలు రూపొందించడంలో పుణె, చెన్నైకు చెందిన విద్యార్థులు కీలక పాత్ర పోషించడం అభినందనీయం. శాస్త్రవిజ్ఞానంలో యువత ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది'' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.
శ్రీహరికోటలోని షార్‌ నుంచి బుధవారం ఉదయం చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంతమైంది.
బారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, విద్యాసంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలు, 17 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com