ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్
- October 14, 2024
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు.
ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియుతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
ఫాక్స్కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఫాక్స్ కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







