ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్
- October 14, 2024
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు.
ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియుతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
ఫాక్స్కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఫాక్స్ కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







