శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- October 14, 2024
తిరుమల: ఈ నెల 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.భారీ వర్ష హెచ్చరికతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.రేపు(అక్టోబర్ 15) తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబోమమని అధికారులు తెలిపారు.భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల, తిరుపతిలోనూ రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బంది పడకుండా రేపటి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. 16వ తేదీకి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సాధారణంగా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. ఒకరోజు ముందుగానే సిఫార్సు లేఖలు స్వీకరిస్తారు. అంటే.. 16వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. 15వ తేదీన సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. అయితే, రేపు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ చెప్పింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.
మరోవైపు..తిరుమల, తిరుపతిలో భారీ వర్షాల కారణంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అనేక జాగ్రత్తలు తీసుకుంది.ఇటు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించింది.ఎక్కడైతే కొండచరియలు విరిగిపడతాయో అక్కడ జాగ్రత్తలు తీసుకుని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సిందిగా..ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఈవో సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి