పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!

- October 15, 2024 , by Maagulf
పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో కేంద్రమంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి... పాకిస్తాన్ కు వెళ్లిన కేంద్రం మంత్రిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. భారత విదేశాంగ మంత్రి హోదాలో... జై శంకర్ తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా... షాంగై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్.ఇక సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కూడా జై శంకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ అలాగే జై శంకర్ లు ఒకరినొకరు పరిష్కరించుకున్నారు.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com