పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!

- October 17, 2024 , by Maagulf
పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!

గాజా: గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవల కారణంగా సామాన్య ప్రజలు చాలా మంది మరణించారు.అయితే తాజాగా ఇజ్రాయిల్ చేసిన పనికి.. గాజాకు చెందిన 28 మంది దుర్మరణం చెందారు.ఈ సంఘటన గురువారం రోజున రాత్రి ఈ చోటు చేసుకుంది.

 ఉత్తర గాజాలో ఉన్న ఓ పాఠశాల భవనంపై...ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ ఘటనలో ఏకంగా 15 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారట.ఇక ఈ సంఘటనలో.. మరో 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక గాజాలోని... హుస్సేని అనే స్కూల్ వద్ద కూడా కాల్పులు జరిపారు ఇజ్రాయిల్ మూకలు.ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయట.దీంతో గాజా వణికిపోతోంది.

--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com