AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- October 18, 2024
కువైట్: కువైట్ రోడ్లలో వేగంగా వెళ్లడం, ఫోన్ వాడకం అత్యంత సాధారణ ఉల్లంఘనలుగా మారాయి.వీటికి అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కఠినమైన ట్రాఫిక్ చట్టాలను అమలు చేస్తుంది. జనవరి 1 నుండి జూన్ 30 మధ్య కువైట్లోని ఆరు గవర్నరేట్లలో 9,472 నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఉల్లంఘనలతో 1.5 మిలియన్ల ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ కాలంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలలో 93 శాతానికి పైగా రాక్ లెస్ డ్రైవింగ్ చేయడం వల్ల కాగా, 7 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహాద్ అల్-ఇస్సా తెలిపారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 30వేలకుపైగా నమోదయ్యాయి. డ్రైవింగ్లో సీట్బెల్ట్ వినియోగ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి 252 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త AI కెమెరాలు ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక