AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- October 18, 2024
కువైట్: కువైట్ రోడ్లలో వేగంగా వెళ్లడం, ఫోన్ వాడకం అత్యంత సాధారణ ఉల్లంఘనలుగా మారాయి.వీటికి అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కఠినమైన ట్రాఫిక్ చట్టాలను అమలు చేస్తుంది. జనవరి 1 నుండి జూన్ 30 మధ్య కువైట్లోని ఆరు గవర్నరేట్లలో 9,472 నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఉల్లంఘనలతో 1.5 మిలియన్ల ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ కాలంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలలో 93 శాతానికి పైగా రాక్ లెస్ డ్రైవింగ్ చేయడం వల్ల కాగా, 7 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహాద్ అల్-ఇస్సా తెలిపారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 30వేలకుపైగా నమోదయ్యాయి. డ్రైవింగ్లో సీట్బెల్ట్ వినియోగ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి 252 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త AI కెమెరాలు ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









