AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- October 18, 2024
కువైట్: కువైట్ రోడ్లలో వేగంగా వెళ్లడం, ఫోన్ వాడకం అత్యంత సాధారణ ఉల్లంఘనలుగా మారాయి.వీటికి అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కఠినమైన ట్రాఫిక్ చట్టాలను అమలు చేస్తుంది. జనవరి 1 నుండి జూన్ 30 మధ్య కువైట్లోని ఆరు గవర్నరేట్లలో 9,472 నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఉల్లంఘనలతో 1.5 మిలియన్ల ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ కాలంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలలో 93 శాతానికి పైగా రాక్ లెస్ డ్రైవింగ్ చేయడం వల్ల కాగా, 7 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహాద్ అల్-ఇస్సా తెలిపారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 30వేలకుపైగా నమోదయ్యాయి. డ్రైవింగ్లో సీట్బెల్ట్ వినియోగ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి 252 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త AI కెమెరాలు ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







