దుర్గమ్మకు దసరా భక్తుల కానుకల వెల్లువ !
- October 22, 2024
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాల్లో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నగదు బంగారం వెండితో పాటు విదేశీ డాలర్లను కనుక సమర్పించారు.
అధికారులు భక్తుల సమర్పించిన హుండీల లెక్కింపును ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు నిర్వహించారు. ఇప్పటికే రెండు దఫాలుగా హుండీ లెక్కింపు నిర్వహించగా సోమవారం మూడో రోజు పలు హుండీలను లెక్కించారు.
కాగా, సోమవారం హుండీ లెక్కింపు సందర్భంగా… నగదు రూ. 3,05,96,971/- లు అమ్మవారికి భక్తులు నగదు రూపంలో కానుకలు చెల్లించుకున్నారు. కానుకల రూపములో బంగారం 321 గ్రాములు, వెండి 9 కేజీల 882 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్సీ లో యూఎస్ఏ-168 డాలర్లు, ఆస్ట్రెలియా 55 డాలర్లు, కువైట్-41.5 దినార్లు, ఖతార్-27 రియాల్స్, యూఏఈ-5 దిర్హాములు, మలేషియా-10 రింగేట్లు, సౌదీ-100 రియాల్స్ ను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు కలిపి నగదు రూ.9,26,97,047/- లు, కానుకల రూపములో బంగారం 733 గ్రాములు, వెండి 25 కేజీల 705 గ్రాములు అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు విదేశీ డాలర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







