ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!
- October 27, 2024
యూఏఈ: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని యూఏఈ ఖండించింది. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) ఒక ప్రకటనలో కోరింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్పై టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్లోని సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్లలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని ఇరాన్ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







