ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..యూఏఈ తీవ్ర ఆందోళన..!!
- October 27, 2024
యూఏఈ: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని యూఏఈ ఖండించింది. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) ఒక ప్రకటనలో కోరింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్పై టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్లోని సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్లలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని ఇరాన్ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









