కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం..
- October 29, 2024
కేరళ సీఎం పినరయి విజయన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ మహిళ కారణంగా సీఎం కాన్వాయ్ లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. అయితే, ఎలాంటి ప్రమాదం జరగడకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ స్కూటీపై కాన్వాయ్ కు అడ్డుగా రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
సీఎం విజయన్ కొట్టాయం సందర్శనకు వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం రాజధానికి వెళ్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో వామనపురం వద్ద సీఎం కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. వామనపురంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ సీఎం కాన్వాయ్ వచ్చే సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన కాన్వాయ్ లోని ముందు వెళ్తున్న పైలట్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక ఉన్న సీఎం కారు, అంబులెన్స్ సహా ఎస్కార్ట్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటీన బయటకుదిగి సీఎం ప్రయాణిస్తున్న కారు వద్దకు చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో అదృష్టవ శాత్తూ సీఎం, ఇతర సిబ్బందికి ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే కాన్వాయ్ ముందుకు కదిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళ స్కూటీ నడిపిన తీరుపట్ల మండిపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









